![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కొత్తగా రిషి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో రంగా పాత్రలో ఎంట్రీ ఇచ్చిన రిషికి మరదలి పాత్రలో సరోజ నటిస్తోంది. తన యాక్టింగ్ కి రిషి ఫ్యాన్స్ కూడా అభిమానులు అవుతున్నారు. అంతలా మెప్పిస్తున్న సరోజ గురించి తెలుసుకుందాం.
లంగాఓణీ.. జడగంటలు కట్టి.. బొద్దుగుమ్మలా మారిన వసుధార కంటే ఈ పిల్లే బాగుందిగా అన్నట్టుగా ఉన్న సరోజ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలిసిన పిల్లే. పైగా ఈమె మన తెలుగు అమ్మాయే. అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ కుట్టీలు ఏలేస్తుండగా.. తెలుగు వాళ్లకి అరకొరగా అవకాశాలు దక్కుతున్నాయి. కాగా గుప్పెడంత మనసు కొత్త కథలో రంగా మరదలు సరోజగా కీలక పాత్ర దక్కించుకున్న ఈ బ్యూటీ అసలు పేరు వినీత. వినీత మన తెలుగు అమ్మాయే. పక్కా హైదరాబాదీ. ఇక్కటే పుట్టి పెరిగింది. బీటెక్ వరకూ చదివిన వినీత.. 2020 కోవిడ్ బ్యాచ్లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్లోకి రాకముందు తమడా మీడియాలో పనిచేసింది వినీత. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్లో నటించింది వినీత. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత.. వెండితెరపై అవకాశం రాలేదు కానీ.. బుల్లితెరపై రాణిస్తోంది. అనేక సీరియల్స్లో నటించింది వినీత.
మొదట్లో ఈవీటీలో అను- పల్లవి సీరియల్లో నటించిన వినీత.. జీ తెలుగులో ‘దేవతలారా దీవించండి’, ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్స్లో నటించింది. వీటితో పాటు పలు టీవీ షోస్లోనూ కనిపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ వినీత పంచ్లు పేల్చింది. దేవతలారా దీవించండి సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సీరియల్లోనూ మెప్పించింది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది వినీత. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో రంగా (రిషి) మరదలిగా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా, తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తోంది వినీత. అయితే వినీత వల్లభాపురపు(Vineetha Vallabhapurapu) ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఓసారి చూసేయ్యండి.
![]() |
![]() |